Thursday 4 April 2019

బుజ్జి నరసింహా

అవి జనవరి చివరి రోజులు, తెల్లవారి జామున ఐదున్నర  కావస్తుంది . గాఢ నిద్రలో వున్నా తులసి ప్రక్కన ఫొన్ మోగుతుంది. కాబోయే మామగారు ఫోన్ లో "అయ్యా అత్తయ్య గారు చనిపోయారు" అని ఏడుస్తున్నారు.
               ఒక్కసారిగా గుండె జారినట్టు అయ్యింది. తెలియకుండానే కంట్లో నుండి నీళ్లు కారుతున్నాయి. ఒక్కసారి కళ్ళు మూసి ఆలోచిస్తే ఇంకా పెళ్ళికి పది రోజులే వున్నాయి . పెళ్లి పనులు అన్ని పూర్తి కావస్తున్నా సమయంలో ఇలా జరగడం చాల బాధకు గురిచేసింది ."కల్యాణమండపం కి advance కట్టేసాడు, decoration కి, photographers కి డబ్బులు ఇచ్చేసాడు. శుభలేఖలు ప్రింట్ చేయించాడు. నిన్ననే హనీమూన్ కి కూడా టిక్కెట్లు కూడా బుక్ చేసాడు. ఇవన్నీ ఒక ఎత్తు ఐతే చుట్టాలు ఏమనుకుంటారో అన్న భయం మనసులో మొదలయ్యింది.     
              ఇవన్నీ నాకే ఎందుకు జరుగుతున్నాయి అని మనసులో తాను పూజించే లక్ష్మి నరసింహస్వామిని అడగడం మొదలుపెట్టాడు. తాను ఏమైనా తప్పులు చేశాడా  అని గుర్తుచేసుకుంటూ ఊరికి బయలుదేరాడు.MGBS  నుండి బస్సు బయలుదేరింది. కిటికీ ప్రక్కన  కూర్చొని వాళ్ళ అమ్మకి ఫోన్ చేాడు. "ఏంటమ్మా  అన్నీ  మనకే ఇలా జరుగుతున్నాయి ". ఆలా అనుకోకు రా, దేవుడు మనకి ఎలా రాసి పెట్టి ఉంటే ఆలా జరుగుతుంది అని ధర్యం చెప్పింది.
               బస్సు దిగిన వెంటనే అత్తగారిని చూడడానికి వాళ్ళింటికి వెళ్ళాడు. తులసిని చూడడంతోనే తాను చేసుకోబోయే అమ్మాయి వచ్చి చెయ్యి పట్టుకొని ఏడుస్తుంది. తులసికి ఒక్కసారిగా కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆ అమ్మాయికి ధర్యం చెప్తూ వాళ్ళ అత్త గారి మొహం చూస్తూ నిలబడిపొయ్యాడు.
              ఇవన్నీ అలావుంటే ఆ అమ్మాయి తులసి తో " ఇలా జరిగింది అని నన్ను వదిలేయరుగా అని అడిగింది". ఆలా అనకు ఇన్ని బాధల్లో వున్న మిమ్మల్ని నేను వదిలేస్తే నేను అసలు మనిషినే కాదు, నువ్వేమి అలాంటి ఆలోచనలు పెట్టుకోకు. " మీ అమ్మకి ఆరోగ్యం బాగోదు అని మనసుకి తెలిసిందే కదా" అనుకోకుండా ఆలా జరిగిపోయింది, నువ్వు ధర్యంగా ఉండు.
             మొత్తం కార్యక్రమం అయ్యాక ఇంటికి వెళ్తున్న తులసికి ఎదో వదిలి వెళ్తున్నాని బాధగా ఉంది. ఆ అమ్మాయిని ఆలా వదిలి వెళ్లాలనిపించలేదు. అసలే వాళ్ళ అమ్మ చనిపోయారు అని చాలా బాధపడుతుంది, ఇంకోసారి వెళ్లి ఓదార్చి వచ్చాడు. ఆ రోజంతా పెళ్లి ముందు ఏంటా ఇలా జరిగింది అని సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు.
             తరువాత రోజు ఉదయాన్నే నిద్ర లేచి ఆ అమ్మాయి కి ఫోన్ చేసాడు. ఆ అమ్మాయి ఏడుస్తూ రోజు పొద్దునే మా అమ్మ నిద్రలేపేది, ఈ రోజు ఇల్లు ఎంత బోసిగా ఉందంటే, అమ్మ లేదనే నిజం జీరఁనుంచోకోలేకపోతున్నాం. మా చెల్లెలు ఐతే నిన్నటి నుండి ఏడుస్తూనే వుంది. ఇవన్నీ విన్న తులసి మనకి ఆ లక్ష్మి నరసింహస్వామి వున్నాడు, ఆయన్ని తలుచుకుంటూ ఉండు. ఆయనే నీకు ధర్యం కల్పిస్తాడు.......        

No comments:

Post a Comment